Fighting Injustice in Polepally SEZ

…more than courage it takes WILL to stand up against injustice !

Archive for the ‘Eenadu’ Category

సెజ్‌ బాధిత మహిళల అరెస్టు

without comments

జడ్చర్ల గ్రామీణం, న్యూస్‌టుడే: కేసు వివరాలేవి తెలుపకుండా సెజ్‌ బాధితులను పోలీసులు అరెస్టు చేయడంతో జడ్చర్ల మండలం పోలేపల్లి గ్రామం ఉలిక్కిపడింది. ఈ విషయంపై టీవీల్లో వార్తలు రావడంతో చర్చనీయాంశమైంది. చివరకు జడ్చర్ల కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరు పర్చగా బెయిల్‌పై విడుదల కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. Read the rest of this entry »

Written by JayaPrakash Telangana

June 8, 2009 at 8:20 am

పోలేపల్లిలో ఎల్‌అండ్‌టీ కంపెనీ నిర్మాణాలు

with 2 comments

అడ్డుకున్న సెజ్‌ బాధితులు | టెంట్‌ కూల్చివేత, పూజా సామగ్రి దగ్ధం

జడ్చర్లగ్రామీణం, న్యూస్‌టుడే: పోలేపల్లి ఫార్మాసెజ్‌ల సమీపంలో ఎల్‌అండ్‌టీ కంపెనీ వారు నిర్మాణాలు చేపట్టేందుకు భూమిపూజ చేస్తున్న విషయాన్ని తెలుసుకున్న సెజ్‌ బాధితులు అక్కడికి వచ్చి ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. బుధవారం జరిగిన ఈ కార్యక్రమంలో రైతులు వచ్చిన విషయాన్ని గుర్తించి ఆ కంపెనీ ప్రతినిధులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో అక్కడ వేసిన టెంటును కూల్చివేసి పూజా కార్యక్రమాలు వస్తువులను గుంతలో వేసి నిప్పంటించారు. Read the rest of this entry »

Written by JayaPrakash Telangana

January 22, 2009 at 5:54 pm

Posted in Eenadu, Telugu

Tagged with , ,

పోలేపల్లిలో మళ్లీ లొల్లి

without comments

ఏపీఐఐసీ డబ్బులతో అభివృద్ధి పనులు | అడ్డుకున్న బాధిత రైతులు

జడ్చర్లగ్రామీణం, న్యూస్‌టుడే: భూములు కోల్పోయి వీధిన పడ్డ సెజ్‌ బాధితుల కోసం ప్రభుత్వం ఏపీఐఐసీ ద్వారా కోటి 15 లక్షలను కేటాయించింది. వీటితో పోలేపల్లిలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు నిర్ణయించగా బాధితులు వ్యతిరేకించారు. మంగళవారం తహసిల్దార్‌ క్రిష్ణస్వామి పనులపై అభిప్రాయాలను సేకరించగా రైతులు తిరగబడ్డారు. Read the rest of this entry »

Written by JayaPrakash Telangana

January 7, 2009 at 6:08 pm

Posted in Eenadu, News Archive, Telugu

బాంబుల వర్షం కురిసిన భయపడొద్దు

without comments

* ‘సెజ్‌’ బాధితులకు గద్దర్‌ బాసట          * భూములిచ్చే దాక పోరాడండి
* వైఎస్‌, చంద్రబాబు ఒకే గూటి పక్షులు     * బాధితులతో కలిసి ఆటపాట

జడ్చర్ల, న్యూస్‌టుడే: అన్నం పెట్టే రైతు కావాలో… విషాన్ని పంచే కంపెనీలు కావాలో.. రైతు రాజ్యమంటున్న వైఎస్‌ తేల్చుకోవాలని ప్రజా గాయకులు గద్దర్‌ సవాల్‌ విసిరారు. పోలేపల్లి బాధితులకు ఏం న్యాయం చేస్తారో సీఎం స్వయంగా ఇక్కడికి వచ్చి ప్రకటించాలని ఆయన డిమాండ్‌ చేశారు. మంగళవారం సాయంత్రం పోలేపల్లి సెజ్‌ బాధితుల సత్యాగ్రహంలో ఆయన పాల్గొని తన మద్దతును ప్రకటించారు. Read the rest of this entry »

చిరంజీవి ప్రసంగంపై బాధితుల అసంతృప్తి

with 9 comments

మహబూబ్‌నగర్‌: తమ దగ్గర నుంచి తీసుకున్న భూములకు పరిహారంగా రూ.10 లక్షలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని తాము ఎంతోకాలంగా పోరుతున్నామనీ, దీనిపై చిరంజీవి స్పష్టమైన హామీ ఇవ్వలేదని పోలేపల్లి సెజ్‌ బాధితుతులు ఈరోజు మధ్యాహ్నం నిరసనకు దిగారు. చిరంజీవి ప్రసంగాన్ని పూర్తి చేసి వెళ్లిపోయిన తర్వాత బాధితుల్లో అసంతృప్తి వ్యక్తమైంది. చిరు ప్రసంగంలో స్పష్టత లేదనీ, తమకు ఏం చేస్తారో చెప్పలేదని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న చిరంజీవి వెనక్కి తిరిగి వచ్చి సెజ్‌ బాధితుల ఐక్య సంఘటన సభ్యులతో మాట్లాడారు. ఈ సమస్యను అధ్యయనం చేసిన తర్వాత తగు నిర్ణయం తీసుకుంటామని చిరంజీవి వారికి హామీ ఇచ్చారు.

(Courtesy: Eenadu, 26 Sept 2008)

Written by JayaPrakash Telangana

September 26, 2008 at 7:19 pm

మీరు దగా పడ్డారు.. శుక్రవారం మీ వూరొస్తా: ‘సెజ్‌’ బాధితులతో చిరంజీవి

with 6 comments

కొంత కాలం ఆగండి అన్నింటికీ పరిష్కారం
మీరు దగా పడ్డారు.. శుక్రవారం మీ వూరొస్తా
పోలేపల్లి ‘సెజ్‌’ బాధితులతో చిరంజీవి వ్యాఖ్య

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: మరికొంత కాలం వేచిచూడాలని, తమ సమస్యలన్నిటికీ పరిష్కారం లభిస్తుందని మహబూబ్‌నగర్‌ జిల్లా పోలేపల్లి ప్రత్యేక ఆర్థిక మండలి(సెజ్‌) బాధితులతో ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి అన్నారు. ”మీ పరిస్థితి చూస్తే హృదయవిదారకంగా ఉంది. మీ సమస్య గురించి గతంలో విన్నా. మీరు దగా పడ్డారు. ఎల్లుండి(ఈ నెల 26న) మీ గ్రామానికి వస్తా. ప్రత్యక్షంగా చూస్తా. మీకు అండగా ఉంటా. ప్రతి సమస్యకూ పరిష్కార మార్గాలు ఉన్నాయి. వాటిని అన్వేషించాలి” అని ఆయన వారితో పేర్కొన్నారు. సెజ్‌తో పోలేపల్లిలో భూములు కోల్పోయిన దాదాపు 20 కుటుంబాలవారు బుధవారమిక్కడ ప్రరాపా కార్యాలయంలో చిరంజీవిని కలిశారు. తమ పరిస్థితి గురించి దాదాపు గంటపాటు ఆయనకు వివరించారు. ప్రభుత్వం తమను భయభ్రాంతులకు గురిచేస్తూ భూములు లాక్కొన్నట్లు చెప్పారు. నష్టపరిహారం విషయంలోనూ తాము తీవ్ర అన్యాయానికి గురయ్యామని కంటతడి పెట్టుకొన్నారు. ”మాకు భూములున్నపుడు వ్యవసాయం చేసుకొంటూ బతికాం. ఇప్పుడు అప్పులపాలై పిల్లల్ని చదువులు మాన్పించి తినడానికి కూడా లేక ఇబ్బందులు పడుతున్నాం” అని ఆవేదన వ్యక్తంచేశారు. దేశవ్యాప్తంగా మహబూబ్‌నగర్‌ జిల్లా పేదలు కూలీలుగానే ఉన్నారని, ఈ నిరుపేదల పక్షాన నిలవాలని కోరారు. వారు చెప్పిందంతా విన్న తర్వాత, ”ఇప్పటివరకు ఓపిక పట్టిన మీరు మరికొంత కాలం ఉండాలి. మీ సమస్యలన్నింటికి పరిష్కారం లభిస్తుంది” అని చిరంజీవి భరోసా ఇచ్చారు.

(Courtesy: Eenadu 25th Sept 2008)

Written by Konatham Dileep

September 25, 2008 at 9:41 am

Press Coverage : Polepally Public Hearing

without comments

Written by Polepally InSolidarity

August 8, 2008 at 2:30 am

కేంద్రాన్ని మోసం చేశారు… రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించాలి

without comments

* పారిశ్రామికీకరణకు విరుద్ధంగా సెజ్‌లకు అప్పగించారు
* తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు కోదండరాం
జడ్చర్ల గ్రామీణం, న్యూస్‌టుడే: కేంద్రం ద్వారా వచ్చిన నిధులతో గ్రోత్ కారిడార్ కోసం పోలేపల్లిలో వెయ్యి ఎకరాల్లో పారిశ్రామిక అభివృద్ధి చేయాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా వ్యవహరించిన రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని మోసం చేసిందని తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు కోదండరాం ఆరోపించారు. మంగళవారం జడ్చర్ల మండలంలోని పోలేపల్లి ఫార్మా కంపెనీల వద్దకు చేరిన మట్టి మనుషుల పాదయాత్ర, తెలంగాణ కోసం అంతి’మా’యాత్రలో పాల్గొన్న ఆయన అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. Read the rest of this entry »

Written by Polepally InSolidarity

July 28, 2008 at 1:10 pm

Posted in Eenadu, Telugu

పోలేపల్లి దురాగాతాలపై ప్రజాకోర్టు : సుప్రీం కోర్టు మాజీ జడ్జి రాక

with one comment

జడ్చర్ల గ్రామీణం, న్యూస్‌టుడే: పోలేపల్లిలో 320 కుటుంబాల విధ్వంసానికి, ఇక్కడ జరిగిన దురాగాతాలపై చర్చించడానికి వచ్చే నెల 7న ప్రజాకోర్టును నిర్వహిస్తున్నట్లు పోలేపల్లి సెజ్‌ వ్యతిరేక ఐక్య సంఘటన కన్వీనర్‌ మధుకాగుల తెలియజేశారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ సందర్భంగా అక్రమాల్లో భాగస్వాములైన వారిని ప్రజాకోర్టులో నిలబెట్టేందుకు, సత్వరమే సెజ్‌లను ఆపడానికి జాతీయ, అంతర్జాతీయ మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు చేసేందుకు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు వెల్లడించారు. Read the rest of this entry »

Written by Polepally InSolidarity

July 28, 2008 at 1:00 pm

Posted in Eenadu, News Archive, Telugu

సెజ్‌ దోపిడీని ప్రశ్నిస్తాం

without comments

దేవేందర్‌గౌడ్‌

సెజ్‌ దోపిడీని ప్రశ్నిస్తాం : దేవేందర్‌గౌడ్‌

పోరాటానికి కార్యాచరణ ప్రణాళిక: దేవేందర్‌గౌడ్‌

 

 

జడ్చర్లరూరల్‌, న్యూస్‌టుడే:బ్రిటిష్‌ పాలకులు కూడ చేయనివిధంగా పేదల భూములు లాక్కొని కనీసం శవాలను బొందపెట్టేందుకు భూమి లేకుండా వైఎస్‌ ప్రభుత్వం చేస్తుందని ఎన్టీపీపీ అధ్యక్షుడు దేవేందర్‌గౌడ్‌ విమర్శించారు. Read the rest of this entry »

న్యాయం కోసం పోరాటం

without comments

ఎన్టీపీపీ ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి

జడ్చర్లగ్రామీణం,జూలై 24 (న్యూస్‌టుడే): మనదేశంలో అమెరికా విధానాల ప్రయోగంతో పేదవాడు పేదవాడిగా…సంపన్నులు మరింత సంపన్నులుగా మారుతున్నారని నవ తెలంగాణ ప్రజాపార్టీ ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి అన్నారు. గురువారం జడ్చర్ల మండలం పోలేపల్లి సెజ్‌ వద్ద బాధితులు నిర్వహించిన సంఘీభావ యాత్రలో ఆయన పాల్గొన్నారు. Read the rest of this entry »

Written by Polepally InSolidarity

July 26, 2008 at 1:38 am

మళ్లీ భూయజ్ఞం – లక్ష్యం రూ.4100 కోట్లు

without comments

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: కొత్త ఆర్థిక సంవత్సరంలో భూముల విక్రయాలకు ప్రభుత్వం మళ్లీ తెరతీసింది. ఇప్పటికే భూముల వేలం ద్వారా ఖజానాను నింపుతున్న రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (ఏపీఐఐసీ)ను 2008-09లో రూ. 4100 కోట్లను సంపాదించి పెట్టాలని హుకుం జారీ చేసింది. Read the rest of this entry »

Written by Konatham Dileep

April 24, 2008 at 2:06 am

Posted in Eenadu, News Archive, Telugu