Fighting Injustice in Polepally SEZ

…more than courage it takes WILL to stand up against injustice !

Archive for the ‘Veekshanam’ Category

ప్రత్యేక ఆర్థిక మండలాలు – మహిళలపై ప్రభావం

with one comment

సెజ్‌ల వల్లత భూములు కోల్పోయిన రైతుల కష్టాలను, ఈ పరిణామాలతో మరిన్ని అవస్థల పాలవుతున్న స్త్రీల పరిస్థితిని వివరిస్తున్నారు సాదు రాజేష్‌

అభివృద్ధి ఎలా ఉంటుంది? అభివృద్ధి ఫలాలు ఎవరు అందుకోవాలి? అభివృద్ధి అవసరం ఎవరికి కావాలి? అభివృద్ధిని ఎలా సాధించాలి? ఈ ప్రశ్నలకు నేడు మన ప్రభుత్వాల నూతన అభివృద్ధి సంస్కరణల విధానం స్పష్టంగా తెలియజేస్తోంది. అభివృద్ధి అంటే పచ్చని పంటలతో తులతూగే పల్లె సీమలను విస్తాపనం చేసి వాటి స్థానంలో ధగధగ కాంతులతో మెరిసే హోటల్స్‌ను, సినిమాహాళ్లను, టౌన్‌షిప్‌లను, హబ్‌లను, పబ్‌లను నిర్మించి కొంతమంది ధనికులకు ఆనంద నిలయాలను తయారు చేయడమే అభివృద్ధిగా చెప్పడం జరుగుతోంది. Read the rest of this entry »

Written by Polepally InSolidarity

September 11, 2008 at 9:38 pm

చెబుతున్నదేమిటి – చేస్తున్నదేమిటి?

without comments

జెండాలు ఏవైనా, ఎజెండా ఏది ప్రకటించినా సామ్రాజ్యవాదులను సంతృప్తి పరచడంలో పాలక, ప్రతిపక్ష పార్టీలన్నింటి విధానం ఒకటేనని అంటున్నారు ఎం. రత్నమాల

అక్షరక్రమంలో రెండో స్థానంలోనే కాదు ప్రత్యేక ఆర్థిక మండళ్లు నెలకొల్పడంలో కూడా ఆంధ్రప్రదేశ్‌ రెండో స్థానంలో ఉంది. భారతదేశం మొత్తం మీద అన్ని రాష్ట్రాలు కలిపి 446 సెజ్‌లు ఇప్పటికి ఏర్పాటు కానుండగా మన రాష్ట్రం 76 సెజ్‌లను అనుమతించుకుని దేశంలో రెండో స్థానంలో ఉంది. 88 సెజ్‌ల మహారాష్ట్రను కూడా మించడానికి ఆంధ్రప్రదేశ్‌ ఇటీవల రాష్ట్ర సముద్రతీరం పొడుగునా కోస్టల్‌ ఇండస్ట్రియల్‌ కారిడార్‌ నిర్మాణంతో పాటు మరో పన్నెండు ప్రత్యేక ఆర్థిక మండలాలు (స్పెషల్‌ ఎకానామిక్‌ జోన్స్‌ అనే సెజ్‌లు పొడి అక్షరాల్లో ఎస్‌.ఇ.జెడ్‌ లు) రాష్ట్రంలో ఇప్పటికే ఏర్పాటయిన 54 ప్రత్యేక ఆర్థిక మండలాల్లో (సెజ్‌ల్లో) 27 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి ఆశ చూపుతున్నారు. Read the rest of this entry »

Written by Polepally InSolidarity

July 1, 2008 at 2:58 am

దారితప్పిన ప్రత్యేక ఆర్థిక మండలాలు

without comments

సామాజిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే సెజ్‌ల స్థాపనకు అనుమతి ఇవ్వాలని, ఈ విషయంలో ప్రభుత్వం తగు జాగ్రత్తలు వహించాలని అంటున్నారు డా. యిమ్మానేని సత్యసుందరం

భారతదేశ ఆర్థిక పరిస్థితి బాగానే ఉంది. అయితే, ప్రధాన సమస్యలైన దారిద్య్రం, నిరుద్యోగం పరిష్కరించుకోలేకపోయాం. ఇటీవల కాలంలో సగటు అభివృద్ధి రేటు ఎనిమిది శాతం దాటి ఉంది. ఈ రేటు మాత్రమే మన సమస్యలను పరిష్కరించలేదు. పైగా కొత్త సమస్యలను సృష్టించవచ్చు. అభివృద్ధి రేటుతోపాటు అభివృద్ధి తీరుకూడా ముఖ్యమే. అభివృద్ధి ఫలాలు అన్నివర్గాలకు, అన్ని ప్రాంతాలకు అందాలి. అదే నిజమైన ప్రగతి. ఈ విషయంలో మనదేశం ఆశించిన విజయం సాధించలేదు.
Read the rest of this entry »

Written by Polepally InSolidarity

July 1, 2008 at 2:54 am

Posted in Articles, Telugu, Veekshanam

Tagged with , ,

మహాసెజ్‌గా మారనున్న హైదరాబాద్‌

without comments

సెజ్‌లనూ తూర్పు ఇండియా కంపెనీని పోల్చి చూపుతూ, సెజ్‌ విధానం వల్ల హైదరాబాద్‌లో జరుగుతున్న పరిణామాలను కళ్లకు కడుతున్నారు డా. ఘంటా చక్రపాణి

చరిత్ర పునరావృతమవుతుందన్న సత్యాన్ని ఎన్నో సంఘటనలు, సందర్భాల తరువాత ఆవిష్కరించి ఉంటారు. ప్రతిరోజూ సూర్యుడు తూర్పున ఉదయించడం, పడమట అస్తమించడం గమనించి భూమి గుడ్రంగా ఉంటుందని, పదే పదే అదే కక్ష్యలో తిరుగుతుందనీ అర్థం చేసుకొన్నట్లే చరిత్ర గమనంలో కూడా గతించిన సందర్భాలు మళ్లీ మళ్లీ ఎదురవడం చూసి పునరావృతమవుతుందన్న నిర్ధారణకొచ్చి ఉంటారు. అలాంటి సందర్భమే ఇప్పుడు మళ్లీ వచ్చింది. Read the rest of this entry »

Written by Polepally InSolidarity

July 1, 2008 at 2:15 am

పోలేపల్లి ప్రజల పోరుబాట

without comments

సెజ్‌ల కోసం పంట భూములు గుంజుకొని, బిచ్చంగా రెండు రూపాయల బియ్యం ఇస్తున్న ప్రభుత్వ దుర్మార్గాన్ని, నిర్వాసితుల బాధల్ని వివరిస్తున్నారు గీతాంజలి

ఊర్లల్లో మూఢనమ్మకాలు, దారిద్య్రం, కరువు, వలసలు, ఆకలి కారణాలుగా మాస్‌ హిస్టీరియా (పూనకం) వస్తుంది. దాని వెనకాల ఉన్న పైన ఉదహరించిన సామాజిక, ఆర్థిక, రాజకీయ కారణాలు,వాటి పరిష్కారాల జోలికి పోకుండా ప్రభుత్వం ఊర్లల్లోకి ఆ అమాయకమైన ప్రజల దగ్గరికి సైకియాట్రిస్ట్‌లను, మెజిషియన్స్‌ను, కౌన్సిలర్స్‌ను పంపిస్తుంది. వాళ్లు కౌన్సిలింగు జిమ్మిక్కులు చేసి బాణామతి, చేతబడి, పూనకాలు అన్ని కూడా మూఢనమ్మకాలనీ, కొన్నేమో మానసిక వత్తిడివల్ల వచ్చిన సమస్యలని వివరించి మళ్లీ పట్నాల్లోకి తమ కార్పొరేట్‌ ఫైవ్‌స్టార్‌ హాస్పిటల్స్‌లో వచ్చి పడిపోతారు. ప్రభుత్వం చేతులు దులుపుకుంటుంది.
Read the rest of this entry »

Written by Polepally InSolidarity

July 1, 2008 at 2:12 am

రాష్ట్రంలో రెండు సెజ్‌ల కథ

without comments

ప్రజా ప్రయోజనాల్ని కాలరాచి, ప్రభుత్వమే దళారీ అవతారమెత్తి సెజ్‌ల ముసుగులో చేస్తున్న రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం గురించి చెబుతున్నారు కొణతం దిలీప్‌

ఒకటేమో రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం పొందిన పోలేపల్లి సెజ్‌, మరొకటి ఎవరికీ తెలియని జార్జియా టెక్‌ విజ్ఞాన సిటీ సెజ్‌. బయటి నుండి చూస్తే ఈ రెండిటి మధ్యా పెద్దగా పోలికలు లేవు. అయితే రెండిట్లోనూ మనకు కొట్టొచ్చినట్టు కనపడేవి మాత్రం అవినీతి, అంతులేని దోపిడీ. ఈ రెండు సెజ్‌ల కథ తెలుసుకుంటే చాలు అసలు ప్రత్యేక ఆర్థిక మండళ్లు ఎవరి అభివృద్ధి కొరకు ప్రవేశపెట్టబడ్డాయో చాలా తేలికగా అర్థం అవుతుంది. ప్రభుత్వమే దళారీ అవతారమెత్తి సెజ్‌ల ముసుగులో చేస్తున్న అక్రమ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారపు అసలు రంగు ఈ రెండు సెజ్‌ల కథలు మనకు చెపుతాయి.
Read the rest of this entry »

Written by Konatham Dileep

July 1, 2008 at 2:07 am

ప్రజాజీవితాన్ని నాశనం చేస్తున్న సెజ్‌లు

without comments

సెజ్‌ల వలన సాగుభూమి, తాగునీరు, సాగునీరు, పర్యావరణాలను రైతులు నష్టపోతున్నారని, మొత్తంగా ఇదొక సామాజిక విధ్వంసం అని అంటున్నారు పి.వి. రమణ

దేశంలో ఎగుమతులకు ప్రోత్సాహం ఇవ్వటం, పారిశ్రామికీకరణ ద్వారా కోట్లాది ఉద్యోగ అవకాశాలు కల్పించడం లక్ష్యాలుగా పార్లమెంట్‌ లో 23 జూన్‌ 2005న ప్రత్యేక ఆర్థిక మండలాల చట్టం (సెజ్‌) అమలులోకి తెచ్చింది మన ప్రభుత్వం. నిజానికి వ్యవసాయాన్ని దెబ్బ తీయడం, బడా పారిశ్రామికవేత్తలకు, బహుళజాతి కంపెనీలకు సేవ చేయటమనే సామ్రాజ్యవాద విధానలలో భాగమే ఈ సెజ్‌ల ఏర్పాటని ఆచరణలో మనకు అర్థం అయింది. Read the rest of this entry »

Written by Polepally InSolidarity

July 1, 2008 at 2:04 am

పచ్చని పల్లెల్లో సెజ్‌ చిచ్చు

without comments

నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని నాలుగైదు మండలాల్లో ప్రభుత్వం చేపట్టిన సెజ్‌లు పేదల జీవితాలను నామరూపాలు లేకుండా ఎలా నాశనం చేస్తున్నాయో వివరిస్తున్నారు ఘంటా చక్రపాణి

ప్రపంచీకరణ ఫలితాలు ఉహించిన దానికంటే వేగంగా ఒక్కొక్కటీ బయటపడుతున్నాయి. ఇంతకాలం చాపకింది నీళ్లలా పరోక్షంగానే నష్టం కలిగించిన ఆర్థిక సంస్కరణలు, ప్రత్యేక ఆర్థిక మండళ్ల (సెజ్‌ల)తో నేరుగా గ్రామీణ జనజీవితాల్ని ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక వ్యవస్థను ముట్టడిస్తున్నాయి. మన రాజకీయ, పరిపాలన, న్యాయ వ్యవస్థలు చేష్టలుడిగి చూస్తోంటే ఈ విధానాలను ఆసరా చేసుకొని పల్లెల్లో ప్రవేశించిన బహుళజాతి కంపెనీలు, బడా వ్యాపార సంస్థలు ఈస్టిండియా కంపెనీని తలపిస్తున్నాయి. ఇప్పుడు దేశంలోని పల్లెపల్లెనా నయా సామ్రాజ్యవాద పోకడలు ‘సెజ్‌’ల రాకతో స్పష్టంగా కనిపిస్తున్నాయి.
Read the rest of this entry »

ప్రత్యేక ఆర్థిక మండలాలు ఎవరి ప్రయోజనాల కోసం ?

with one comment

అరవై సంవత్సరాల స్వతంత్ర భారత చరిత్రలో ప్రత్యేక ఆర్థిక మండలాలంతగా మనల్ని మనం మోసం చేసుకుంటున్న సందర్భం మరొకటి లేదంటే అతిశయోక్తి కాదంటున్నారు ఎస్‌. సుధాకర్‌

ప్రత్యేక ఆర్థిక మండళ్ల (సెజ్‌) చట్టం 2005 మే లో పార్లమెంట్‌లో ఆమోదం పొంది జూన్‌ నుండి అమలులోకి రావడం జరిగింది. దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రధానంగా భారత రైతాంగాన్ని తీవ్రస్థాయిలో అలజడి, ఆందోళనలకు గురిచేస్తున్న ఈ అంశం ప్రధాన చర్చనీయాంశంగా మారింది. యాభై సంవత్సరాల భారత పార్లమెంటరీ ప్రజాస్వమ్య ప్రయోగాల్ని అపహాస్యం చేస్తూ ముందుకొస్తున్న ఈ ప్రత్యేక ఆర్థికమండళ్ల స్థాపన ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, నూతనఆర్థిక విధానాల అమల్లో మరో కీలకమైన ప్రజావ్యతిరేక మలుపు అని చెప్పక తప్పదు.
Read the rest of this entry »

Written by Polepally InSolidarity

June 1, 2007 at 2:52 am

స్పెషల్‌ ఎకనామిక్‌ జోన్స్‌ (సెజ్‌) – ఒక పరిశీలన

without comments

- సురవరం సుధాకర రెడ్డి

ప్రత్యేక ఆర్థిక మండళ్లులేక స్పెషల్‌ ఎకనామిక్‌ జోన్స్‌ (సెజ్‌) కోసం చట్టం 2005 మే నెలలో పార్లమెంటులో ఆమోదింపబడి అమలులోకి వచ్చిన తర్వాత తీవ్రంగా వివాదాస్పదమైంది. యుపిఎ ప్రభుత్వ హయాంలో తీవ్ర విమర్శలకు గురైన చట్టం బహుశా ఇదే.

ఎగుమతి ఆర్థిక మండళ్ల పేరుతో ఇలాంటి ప్రత్యేక సంస్థలు గతంలో మనదేశంలోనూ, ఇతర దేశాలలోనూ అమలులో ఉండేవి. కాని ఇవి చాలా పరిమితంగా ఉండేవి. 1986 నాటికి ప్రపంచ వ్యాప్తంగా 176 ఎగుమతి మండళ్లు 47 దేశాల్లో ఉండేవి. ప్రపంచీకరణ వేగవంతమయ్యేసరికి 116 దేశాల్లో 3000కు పైగా ఇలాంటి మండళ్లు ఏర్పాటయ్యాయి.

Read the rest of this entry »

Written by Polepally InSolidarity

December 1, 2006 at 10:20 pm

ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు కానున్న ఎస్‌ఇజెడ్‌లు

without comments

ఔషధాలు, బయోటెక్నాలజీ ఇతర పరిశ్రమలు

క్ర.సం. సంస్థ పేరు స్థలం ఉత్పత్తి విస్తీర్ణం (హె||)

  1. దివీస్‌ లాబరేటరీస్‌ లిమిటెడ్‌ చిప్పాడ, విశాఖపట్నం ఔషధాలు 101
  2. రాంకీ ఫార్మాసిటీ లిమిటెడ్‌ లేమర్తి, విశాఖపట్నం ఔషధాలు 243
  3. హెటెరో డ్రగ్సు లిమిటెడ్‌ నక్కపల్లి, విశాఖపట్నం ఔషధాలు 100
  4. ఎపిఐఐసి కరకపట్ల, మెదక్‌ బయోటెక్‌ 40.47
  5. Read the rest of this entry »

Written by Polepally InSolidarity

December 1, 2006 at 2:32 am

ప్రత్యేక ఆర్థిక మండలాలు – కొత్త భూస్వామ్యం

without comments

- ఎన్‌. వేణుగోపాల్‌

దేశంలో భూమి ఇంకా ప్రధాన ఆర్థిక, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక అధికార చిహ్నంగానే ఉన్నదని, భూస్వామ్యవర్గాల పట్టు సడలలేదని, కొత్త భూస్వామ్యవర్గం ఒకటి ప్రపంచీకరణశక్తుల అండ దండలతోనే ఏర్పడుతున్నదని రెండు మూడేళ్ల కిందటిదాకా ఎవరైనా అని ఉంటే వారిని ‘మార్క్సిస్టు మూర్ఖులు’గా అభివర్ణించడం జరిగేది. Read the rest of this entry »

Written by ఎన్.వేణుగోపాల్

December 1, 2006 at 2:29 am

రాజ్యాంగాతీతమయిన అధికారాలతో కొత్త రాజ్యాలు

without comments

- మాడభూషి శ్రీధర్‌

తీవ్ర విమర్శలు, రాజ్యాంగ వివాదాల మధ్య స్పెషల్‌ ఎకనామిక్‌ జోన్‌ల ఆవిర్భావం జరుగుతున్నది. ముమ్మరమయిన అభివృద్ధికి వేలకోట్ల రూపాయల పెట్టుబడులకు ఎస్‌ఇజడ్‌లు వేదికలు కాబోతున్నాయి. విదేశీ పెట్టుబడులు, ప్రపంచీకరణ, ఉదార ఆర్థిక విధానాలు, శాసనాల పట్టు సడలింపులతో సహా అనేకానేక మినహాయింపులతో ప్రత్యేక సదుపాయాలతో, ఎస్‌ఇజడ్‌లు ఈ దేశ స్వరూపాన్ని మార్చబోతున్నాయి. అది మంచికేనా? ఎవరి మంచికోసం? ఈ దేశం సుస్థిర ప్రగతికి ఎస్‌ఇజడ్‌లు పునాదులా? కాదా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వివాదాలు చెలరేగుతున్నాయి.
Read the rest of this entry »

Written by Polepally InSolidarity

December 1, 2006 at 2:26 am

పంట భూములకు సెగపెడుతున్న సెజ్‌లు

without comments

- వి. హనుమంతరావు

గొర్రెల మంద మనస్తత్వం మన రాష్ట్రంలో ఎక్కువగా ఉందేమోననిపిస్తుంది. గ్రెనైట్‌, చేపల చెరువులు, సిమెంటు పరిశ్రమలు అందుకు ఉదాహరణలు. ఎవరో ఒకరిద్దరు ప్రారంభించి లాభాలు చేసుకోవటంతో, అందరూ ఆ పరిశ్రమ మీద పడిపోతారు. మంద ఎక్కువైతే మజ్జిగ పల్చనవుతుంది అన్నట్లు, ఇంతమంది ప్రవేశించటంతో, ఆ ఉత్పత్తులకు అంత మార్కెట్‌ ఉండకపోవటంతో, లేక మరే ఇతర కారణాల వల్లనో లాభాలు రాక ఉత్సాహం సన్నగిల్లుతుంది.
Read the rest of this entry »

Written by Polepally InSolidarity

December 1, 2006 at 2:17 am