List of deaths
42 farmers who lost their lands to the Polepally SEZ have lost their lives either due to hunger, heartbreak or suicide. There is no doubt that all of these farmers were vitims of the ‘Development Terrorism’ of the state.
click here for the list of farmers
పోలేపల్లి (జడ్చర్ల) సెజ్ ప్రత్యక్షంగానో పరోక్షంగానో అనేకమంది రైతన్నల ఉసురు తీసింది. తమ భూమిలో కష్టం చేసుకుని పదో పరకో సంపాదించుకుంటున్న రైతులను ప్రభుత్వం రోడ్డుపాల్జేసింది. గత మూడేళ్లుగా తమకు జరిగిన ఈ అన్యాయాన్ని ఎదిరిస్తూ జడ్చర్ల సెజ్ బాధితులు పోరాటం చేస్తూనే ఉన్నారు. ఈ పోరాట క్రమంలో అలసిపోయి కొందరు, ఆవేదన భరించలేక కొందరు ఈ లోకం నుండి సెలవు తీసుకుంటూనే ఉన్నారు. చనిపోయింది పది మందా, ఇరవై మందా అనే లెక్కలు ప్రస్తుతం కావిక్కడ. ప్రైవేటు దొరలకు లాభం చేకూర్చడం కొరకు మన ప్రభుత్వాలు పేద రైతుల ప్రాణాలు ఎలా తోడేస్తున్నాయన్నదే అసలు విషయం.
అంతో ఇంతో విషయాలు తెలిసిన మనం, ఇవ్వాళ నోరు మూసుకుని ఉంటే రేపు ఇటువంటి లిస్టులో మన పేర్లే ఉండొచ్చుననేది మరచిపోవద్దు!






