Posts Tagged ‘తెలంగాణ’
భూములెందుకు ఇచ్చేయాలి?
-కె.బాలగోపాల్
సకల మానవ ప్రాకృతిక వనరులనూ పెట్టుబడికి దాసోహం చేయడమే పాలకుల అభివృద్ధి నమూనా. దీనికి ప్రత్యామ్నాయం లేదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రకృతిని ప్రజల జీవన వనరుగా గుర్తించి , వారి జీవన ప్రమాణాలను క్రమంగా మెరుగుపరిచే దిశగా వారి భాగస్వామ్యంతో దేశ ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేయడం సాధ్యం కాదా?
దళారీ ప్రభుత్వం – సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ
జడ్చర్ల, అక్టోబర్ 2 (ఆన్లైన్) పేద రైతుల భూములను బలవంతంగా స్వాధీనం చేసుకొని ప్రైవేట్ సంస్థలకు అమ్ముకుంటూ ప్రభుత్వం భూ దళారిగా మారిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ విమర్శించారు. మహబూబ్నగర్ జిల్లా పోలేపల్లి సెజ్ వ్యతిరేక ఐక్య సంఘటన ఆధ్వర్యంలో సాగుతోన్న భూసత్యాగ్రహ శిబిరంలో గురువారం ఆయన బాధితులనుద్దేశించి ప్రసంగించారు.
భూమికి భూమి ఇవ్వాల్సిందే: ప్రజారాజ్యం నేత నాగబాబు
జడ్చర్ల, అక్టోబర్ 2 (ఆన్లైన్): పోలేపల్లి సెజ్ బాధితులకు భూమికి భూమి ఇవ్వాల్సిందేనని ప్రజారాజ్యం పార్టీ నేత నాగబాబు డిమాండ్ చేశారు.మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలంలోని పోలేపల్లి సెజ్లో బాధితులు నిర్వహిస్తోన్న భూ సత్యాగ్రహం శిబిరంలో గురువారం ఆయన ప్రసంగించారు. Read the rest of this entry »
అఖిలపక్ష చర్చ జర్పించాలి :ఎన్టీపీపీ నేత పెద్దిరెడ్డి డిమాండ్
జడ్చర్ల, న్యూస్టుడే: సెజ్ అంశంపై అఖిలపక్ష చర్చ జర్పించాలని నవతెలంగాణ ప్రజాపార్టీ (ఎన్టీపీపీ) నేత పెద్దిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం పోలేపల్లి బాధితుల భూసత్యాగ్రహంలో పాల్గొని మద్దతు తెలిపారు. సెజ్ల పేరుతో పేదల భూములను లాక్కొని వారి బతుకులను రోడ్ల పాలు చేస్తున్నారని మండిపడ్డారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. Read the rest of this entry »
ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు కానున్న ఎస్ఇజెడ్లు
ఔషధాలు, బయోటెక్నాలజీ ఇతర పరిశ్రమలు
క్ర.సం. సంస్థ పేరు స్థలం ఉత్పత్తి విస్తీర్ణం (హె||)
- దివీస్ లాబరేటరీస్ లిమిటెడ్ చిప్పాడ, విశాఖపట్నం ఔషధాలు 101
- రాంకీ ఫార్మాసిటీ లిమిటెడ్ లేమర్తి, విశాఖపట్నం ఔషధాలు 243
- హెటెరో డ్రగ్సు లిమిటెడ్ నక్కపల్లి, విశాఖపట్నం ఔషధాలు 100
- ఎపిఐఐసి కరకపట్ల, మెదక్ బయోటెక్ 40.47






