Posts Tagged ‘APIIC’
పోలేపల్లి బాధితుల ఎన్నికల కరపత్రం
(పూర్తి చిత్రం కొరకు బొమ్మపై నొక్కండి)
- కరపత్రం: మొదటి పేజీ
- కరపత్రం: రెండో పేజీ
- కరపత్రం: మూడో పేజీ
- కరపత్రం: నాలుగో పేజీ
Bhu Nirvasita Gramala Sabha
JAL – JAMEEN – JUNGLE
Voices of struggling masses | Voices of hope | Voices of the land call YOU
Bhu Nirvasita Gramala Sabha
27 & 28 December 2008 At Hyderabad
“There is nothing to compare with the courage of ordinary people whose names are unknown and whose sacrifices pass unnoticed. The courage that dares without recognition, without the protection of media attention, is a courage that humbles and inspires and reaffirms our faith in humanity” – Aung San Sung Kyi.
We invite all students, teachers, workers, writers, intellectuals, activists and friends of varied walks of life to listen to the heroic struggles and woes of our people threatened by ‘development’. Meet representatives from several people’s movements in the cause of protecting their land and lives! You are invited to the people’s struggle for sovereignty, sustainability!
Voices of people fighting displacement
Our team visited different places in last three days. Our aim is to invite activists to come to a common agenda and platform to pressurize state. We thought of organising a big programme in Hyderabad in December with all the movements who are raising voice against this so called development and displacing their lives and villages. We visited Vizag Coastal corridor struggle groups, Gangavaram port Matsyakarula Ikya vedika, Girijana Sangam Araku, fighting against Jindal Bauxite mining, Rayavani Palem, Bauxite Vyatireka Porata Committee, Vizianagarm district.
Perverted development takes one more life
One more farmer lost his life on the altar of SEZ development in Polepally !
Ramulu Goud (48) of Rapally village passed away today. He lost his piece of land in Polepally village. He could not take further pain and loss of hope reducing him from a farmer to a helpless beneficiary of the mercy of SEZ lords and APIIC officials. Depression claimed his life. Read the rest of this entry »
SEZ woes and people’s resistance in AP
- Sujatha Surepally
Polepally team traveled across the state to interact with people fighting against Special Economic Zones, displacements. We interacted with groups in Kakinada SEZ, Krishnapatnam SEZ, Eruru, few others SEZs in Nellore and Polavaram dam displaced adivasis in Bhadrachalam. We are asking seeking the support of all anti-SEZ groups to the Polepally struggle. We need to mobilize all anti-SEZ forces against the state government that is possessed by SEZ madness.
భూములెందుకు ఇచ్చేయాలి?
-కె.బాలగోపాల్
సకల మానవ ప్రాకృతిక వనరులనూ పెట్టుబడికి దాసోహం చేయడమే పాలకుల అభివృద్ధి నమూనా. దీనికి ప్రత్యామ్నాయం లేదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రకృతిని ప్రజల జీవన వనరుగా గుర్తించి , వారి జీవన ప్రమాణాలను క్రమంగా మెరుగుపరిచే దిశగా వారి భాగస్వామ్యంతో దేశ ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేయడం సాధ్యం కాదా?
భూమికి భూమే పరిష్కారం
వెలుగు ప్రాజెక్టులో ఉద్యోగిగా ఉన్న మధుకాగుల ఇప్పుడు ఉద్యమకారునిగా మారిపోయారు. పోలేపల్లి సెజ్ బాధితుల తరపున తెలంగాణ ఐక్య సంఘటన ఏర్పాటు చేసి సాగిస్తున్న పోరాటం రాష్ట్రంలోనే సంచలనంగా మారింది. మొన్న దేవేందర్గౌడ్, నారాయణ, నిన్న బంగారు లక్ష్మణ్, చిరంజీవి సెజ్ల పోరాటానికి పోలేపల్లిని వేదికగా ఎన్నుకున్నారు. Read the rest of this entry »
దళారీ ప్రభుత్వం – సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ
జడ్చర్ల, అక్టోబర్ 2 (ఆన్లైన్) పేద రైతుల భూములను బలవంతంగా స్వాధీనం చేసుకొని ప్రైవేట్ సంస్థలకు అమ్ముకుంటూ ప్రభుత్వం భూ దళారిగా మారిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ విమర్శించారు. మహబూబ్నగర్ జిల్లా పోలేపల్లి సెజ్ వ్యతిరేక ఐక్య సంఘటన ఆధ్వర్యంలో సాగుతోన్న భూసత్యాగ్రహ శిబిరంలో గురువారం ఆయన బాధితులనుద్దేశించి ప్రసంగించారు.
భూమికి భూమి ఇవ్వాల్సిందే: ప్రజారాజ్యం నేత నాగబాబు
జడ్చర్ల, అక్టోబర్ 2 (ఆన్లైన్): పోలేపల్లి సెజ్ బాధితులకు భూమికి భూమి ఇవ్వాల్సిందేనని ప్రజారాజ్యం పార్టీ నేత నాగబాబు డిమాండ్ చేశారు.మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలంలోని పోలేపల్లి సెజ్లో బాధితులు నిర్వహిస్తోన్న భూ సత్యాగ్రహం శిబిరంలో గురువారం ఆయన ప్రసంగించారు. Read the rest of this entry »
సామ్రాజ్యవాద కుట్ర ‘సెజ్’
రూపకర్త బాబు.. అనుసరణ వైఎస్: గద్దర్
జడ్చర్ల, సెప్టెంబర్ 30 (ఆన్లైన్): ‘సెజ్’ సామ్రాజ్యవాద కుట్ర అని ప్రజా గాయకుడు గద్దర్ ధ్వజమెత్తారు. మహబూబ్నగర్ జిల్లా పోలేపల్లి సెజ్ వ్యతిరేక ఐక్య సంఘటన ఆధ్వర్యంలో సాగుతోన్న భూ సత్యాగ్రహ శిబిరాన్ని మంగళవారం సందర్శించిన సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడారు.
బాంబుల వర్షం కురిసిన భయపడొద్దు
* ‘సెజ్’ బాధితులకు గద్దర్ బాసట * భూములిచ్చే దాక పోరాడండి
* వైఎస్, చంద్రబాబు ఒకే గూటి పక్షులు * బాధితులతో కలిసి ఆటపాట
జడ్చర్ల, న్యూస్టుడే: అన్నం పెట్టే రైతు కావాలో… విషాన్ని పంచే కంపెనీలు కావాలో.. రైతు రాజ్యమంటున్న వైఎస్ తేల్చుకోవాలని ప్రజా గాయకులు గద్దర్ సవాల్ విసిరారు. పోలేపల్లి బాధితులకు ఏం న్యాయం చేస్తారో సీఎం స్వయంగా ఇక్కడికి వచ్చి ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. మంగళవారం సాయంత్రం పోలేపల్లి సెజ్ బాధితుల సత్యాగ్రహంలో ఆయన పాల్గొని తన మద్దతును ప్రకటించారు. Read the rest of this entry »
పోలేపల్లి పాపం తెలుగుదేశానిదే: వైయెస్
అఖిలపక్ష చర్చ జర్పించాలి :ఎన్టీపీపీ నేత పెద్దిరెడ్డి డిమాండ్
జడ్చర్ల, న్యూస్టుడే: సెజ్ అంశంపై అఖిలపక్ష చర్చ జర్పించాలని నవతెలంగాణ ప్రజాపార్టీ (ఎన్టీపీపీ) నేత పెద్దిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం పోలేపల్లి బాధితుల భూసత్యాగ్రహంలో పాల్గొని మద్దతు తెలిపారు. సెజ్ల పేరుతో పేదల భూములను లాక్కొని వారి బతుకులను రోడ్ల పాలు చేస్తున్నారని మండిపడ్డారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. Read the rest of this entry »
వైఎస్కు మా ఉసురు ముడ్తది
జడ్చర్ల, సెప్టెంబర్ 28 (ఆన్లైన్) సారూ… మా భూములు పోయినయి… మా బతుకులు బజారున పడినయి… భూములు పోతే బతుకులు ఎట్లా ఉంటాయో వై.ఎస్కు తెలవదా?… మాది మాకు విషం చేస్తున్నాడు… మా ఉసురు వైఎస్కు ముడ్తది… ఇక్కడున్న కంపెనీ వాళ్ళకు కలెక్టరమ్మ అమ్ముడు పోయింది…మా ఎమ్మెల్యే దొంగ … అంటూ ప్రొఫెసర్ హరగోపాల్ ముందు పోలేపల్లి సెజ్ భాదితులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. పోలేపల్లి సెజ్ వ్యతిరేక ఐక్య సంఘటన ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న భూ సత్యాగ్రహ శిబిరాన్ని హరగోపాల్ బృందం ఆదివారం సందర్శించారు.
సెజ్ బాధితులకు అండగా ఉంటామని హరగోపాల్ ఈ సందర్భంగా హమీ ఇచ్చారు.
పత్రికారంగం మీ వెంట ఉంటుంది : ఆంధ్రజ్యోతి సంపాదకులు శ్రీనివాస్
సెజ్ బాధితుల న్యాయమైన పోరాటానికి పత్రికారంగం అండగా ఉంటుందని ఆంధ్రజ్యోతి దినపత్రిక ఎడిటర్ కె శ్రీనివాస్ బాధితులకు భరోసా ఇచ్చారు. పోలేపల్లి రైతులకు న్యాయం జరిగేదాకా వార్తలు రాస్తూ అండగా ఉంటామని చెప్పారు.
(Courtesy: AndhraJyothy 29th Sept 2008)
ప్రభుత్వం పునరాలోచించాలి : ప్రొఫెసర్ హరగోపాల్
జడ్చర్ల, సెప్టెంబర్ 28 (ఆన్లైన్) పోలేపల్లి అంశంపై ప్రభుత్వం పునరాలోచించాలని ప్రొఫెసర్ హరగోపాల్ సూచించారు. ఆదివారం పోలేపల్లి సెజ్ బాధితుల భూ సత్యాగ్రహ శిబిరాన్ని సందర్శించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. పోలేపల్లి సమస్యలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందని, అన్ని రాజకీయ పార్టీలు ఆలోచించాలని కోరారు. ప్రత్యేక ఆర్థిక మండళ్ళపై రాజకీయ పార్టీలు తమ వైఖరిని స్పష్టం చేయాలని అన్నారు. ఆర్థిక విధానాల వల్లే గత ఎన్నికలలో చంద్రబాబు ఓడారని గుర్తు చేశారు. పార్టీల ప్రణాళికలో సెజ్ల అంశంపై రాసుకుని గెలవండని సూచించారు. భూములు కోల్పోయి, బతుకుభారంగా వెల్లదీ సుకుంటున్న సెజ్ భాదితులకు భూమికి భూమి ఇవ్వాలని కోరారు.















